నాలుగులో శ్రేయస్కరమైన ఆటగాడా?



గత మూడేళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌. మ్యాచ్‌ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్‌మన్‌ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్‌ఆర్డర్‌ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే భారత్‌.. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా నాలుగో స్థానంలో నిలకడైన ఆటగాడు లేక పలుసార్లు ఓటమి చవిచూసింది. కాగా ఈ స్థానంలో సరైన ఆటగాడి కోసం టీమిండియా అనేక మందిని పరీక్షించినా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌.



నాలుగులో శ్రేయస్కరమైన ఆటగాడా?